మన్యం మనుగడ, మంగపేట.
పొదుమురు (మంగపేట) దళిత వాడలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశము నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం తహశీల్దార్ మంగపేట అధ్యక్షతన నిర్వహించినారు. ఈ సందర్బంగా మంగపేట తహసీల్దార్ ఎండి సలీం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు, పౌరుడి విధులు ప్రతి ఒక్క పౌరుడి తెలుసుకోవాలి,కులం పేరుతో దూషణ, అంటరానితనం ప్రోత్సహించటం, ఇటువంటి అనాగరిక చర్యలు మానుకోవాలి అన్ని కులాలు, వర్గాలు, జాతులు, వివిధ మతాలకు చెందిన వారు సైతం కలసి మెలసి సోదర భావం తో మెలగాలని సూచనలు చేశారు.తదనంతరం ఏ ఎస్ ఐ అబ్బయ్య మాట్లాడుతూ మీరే భావి భారత నిర్మాతలు దేశ సౌభాగ్య ప్రదాతలు అటువంటి భాద్యతా యుత పౌరులైన మీరు అంటరానితనాన్ని ప్రోత్సహించినట్లయితే శిక్షార్హులు అవుతారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అంటూ తెలియజేశారు ఈ కార్యక్రమ సమావేశములో స్థానిక ఎంపీవో పి శ్రీనివాస్ , ఏఎస్ఐ ఆబ్బయ్య, ఆర్ కుమారస్వామి, సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఇట్టి సమావేశములో అంటరాని తనం, కుల వివక్షత, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టం లోని అమలుతీరు తదితర అంశములను వివరించి పొదుమూరు స్థానిక నివాసులకు వివరించారు.
Post A Comment: