మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఇటీవల నీరు పేద కుటుంబానికి చెందిన కొప్పుల కృష్ణ (27) అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబా సభ్యులను మంగళవారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నాగ రమేష్ పరామర్శించి 2000 రెండు వేల రుపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.మృతి చెందిన కృష్ణకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.చేతికి అందిన కొడుకు చిన్న వయసులోనే మృతి చెందడంతో భార్య తల్లి దండ్రుల కుటుంబ పోషణ ప్రశ్నా ర్థకంగా మారిందని తెలిపారు. మృతుని భార్యకు కుటుంబ పోషణ నిమిత్తం, ఉపాధి కల్పించాలని రామ కృష్ణ సేవా ట్రస్టు సభ్యులను కోరగా వారు తప్పకుండా మా ట్రస్టు నుండి సహాయ సహకారాలు అంది స్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కొమురం వికాస్,బోడ ప్రవీణ్ కుమార్,బాడిశ నవీన్, రామ్మోహన్,జయరాజు,చిట్యాల రాజశేఖర్,కుటుంబ సబ్యులు పాల్గొన్నారు.
Post A Comment: