మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పొగాకు నియంత్రణ ద్వారా మనుషుల్లో వచ్చే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చని ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ ప్రకాష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్య సిబ్బంది జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పొగాకును అతిగా వాడటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందని, తద్వారా మనిషి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకును దూరం పెట్టాలన్నారు. ముఖ్యంగా యువత సైతం సిగరెట్లు, బీడీలు త్రాగకుండా నియంత్రణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శంకరమ్మ, లక్ష్మి, శాంతి,శ్రీనివాస్ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: