దమ్మపేట మే 31 ( మన్యం మనుగడ ) : సిపిఐ అనుబంధ భారత జాతీయ మహిళా సమాఖ్య NFIW. ఆధ్వర్యంలో ధర్నా చేసి దమ్మపేట తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా మహిళా సమాఖ్య మండల కార్యదర్శి జానీ బేగం మాట్లాడుతూ రోజు రోజుకు మహిళల పై అత్యాచారాలు ఎక్కువయ్యాయని చట్టాలను పకడ్బందీగా చేయాలని. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని. మహిళలకు వడ్డీలేని రుణాలు 10 లక్షలు ఇవ్వాలని. ఒంటరి మహిళలకు వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఇంటి స్థలం ఉన్న వారికి ఆరు లక్షలు ఇవ్వాలని వివిధ ప్రజా సమస్యలపై విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాన్ బి నాగవల్లి,నక్క నాగమణి, ఇందు చంద్రకళ కృష్ణకుమారి, గాజ బోయిన కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: