మన్యం మనుగడ, మంగపేట.
మండలంలోని,శనగకుంట అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క. మంగళవారంహైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని ప్రత్యేకంగా కలిశారు. ఈమేరకు ములుగు ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలోని మంగపేట మండలం లో గల శనగకుంట గిరిజనులకు చెందిన 36 ఇల్లు అగ్నిప్రమాదం లో గత నెల 28 వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల నుండి 8 గంటల ప్రాంతంలో విపరీతమైన ఈదురు గాలులు వీయడంతో ఇండ్లు పూర్తిగా కాలి పోయి 40 ఆదివాసి కుటుంబాలు రోడ్డున పడ్డాయని సి.ఎస్ కు వివరించారు. చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు,రేషన్ కార్డులు, ఆస్తి నష్టం ఇతర విలువైన పత్రాలు పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో ములుగునియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల క్రితం తాడ్వాయి మండలంలోని బంధాల గ్రామంలో గుట్టల మీద ఉన్న ఇండ్లు , జీవంతరావు పల్లి ఇంచెన్ చెరువుపల్లి ,వెంకటాపూర్ ఇలా పలు గ్రామాలలో చాలా వరకు ఇండ్లు కాలిపోయాయని తెలిపారు. ఇంతవరకు వారికి డబుల్ బెడ్ రూమ్ రాలేదన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జి.ఓ అయినా తీసుకోవచ్చే విధంగా కృషి చేయాలని, ఇందుకు సంభoదిత జిల్లా అధికారులకు ప్రత్యేక అధికారం ఇచ్చి తక్షణ సహాయం అందేలా చూడాలనికోరారు.బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు, ఒక్కోక్క కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేయాలని ఆమె వారిని కోరారు.
Post A Comment: