గుండాల/ఆళ్లపల్లి మే10(మన్యం మనుగడ) మండలం కేంద్రంలోని రేగా నగర్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో నీటి సదుపాయాన్ని కల్పించిన ఎంపిపి మంజు భార్గవి. మంగళవారం నీటి ఇబ్బందితో సతమతమవుతున్న వారికి మిషన్ భగీరథ సిబ్బందితో మోటార్ బిగించి నీళ్లు వచ్చే విధంగా కృషి చేశారు. సమస్య ప్రభుత్వ విప్ రేగా దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి నీళ్లు వచ్చే విధంగా కృషి చేసిన రేగాకు ధన్యవాదాలు అని రేగానగర్ ప్రజలు పేర్కొన్నారువారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుభార్గవి,మిషన్ భగీరథ డీఈ పద్మావతి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, పిఎసిఎస్ డైరెక్టర్ సాంబశివరావు,టిఆర్ఎస్ నాయకులు వార్డు మెంబర్ ఖయ్యుం, నరెడ్ల ప్రవీణ్ కుమార్, మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం,బుర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: