గుండాల మే 22(మన్యం మనుగడ) గుండాలలో దొంగలు హల్ చల్ చేశారు. తాళాలు పగలగొట్టి చోరీ చేసిన దొంగలు. మండల కేంద్రంలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో కొందరు మిర్చి,బజ్జి ల వ్యాపారం నిర్వహిస్తుంటారు శనివారం రాత్రి దొంగలు పూనెం రాంబాబు చెందిన షాప్ లోకి ప్రవేశించి 5 వేల రూపాయలతో పాటు కేస్ బీర్లు, కేస్ కోటర్లను దొంగిలించారు. సమీపంలోని వాంకుడోత్ రవీందర్ చెందిన దుకాణం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 16 బీర్లను చోరీ చేశారు. మండల కేంద్రంలో చాలా రోజుల తర్వాత దొంగల అలజడి మొదలు కావడంతో గుండాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసు యంత్రాంగం వీరిపై నిఘా పెట్టి దొంగల ఆట కట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: