CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐటీడీఏ కు రెగ్యులర్ పీవో ను నియమించాలి.తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం మండల అధ్యక్షులు వంక నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు హాజరై మాట్లాడుతూ.ఏటూరు నాగారం ఐటిడిఎ పివో గా శాశ్వత ఐఏఎస్ అధికారిని నియమించాలని అన్నారు. ఐటిడిఎ కు రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఏజెన్సీ ఏరియా అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.అదేవిధంగా గిరి వికాస పథకంలో బోరు మంజూరు,గ్రౌండ్ వాటర్ పథకం ద్వారా వేసిన బోర్లకు కరెంటు మంజూరు గాని,షెడ్యూల్ ఏరియాలో అక్రమ కట్టడాల కు అడ్డు అదుపు లేకుండా పోతుందని,ఆదివాసీలు పోడు చేసుకుంటున్న భూముల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఎక్కువయ్యాయని,పెసా గ్రామ సభ ద్వారా చేసిన తీర్మానాలు అమలు కావడం లేదని అన్నారు.ఏజెన్సీ ఏరియాలో ఇసుక క్వారీలను ఆదివాసీ సొసైటీలకు కేటాయించకుండా పట్టా భూములకు సంబంధించిన ఇసుక క్వారీల పేరుతో కాంట్రాక్టర్లు,జిల్లా అధికారులు దోచుకుంటున్నారని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కుంటుపడుతుందని,తక్షణమే ప్రభుత్వం స్పందించి ఐటిడిఎ కు రెగ్యులర్ ఐఏఎస్ అధికారిని పీవో గా నియమించాలని అన్నారు. లేనియెడల ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్ల బోయిన లక్ష్మణ్ రావు,కొర్ని బెల్లి వీరేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పొడెం శోభన్,యాలం మురళి,పోదేం నగేష్,గుండ్ల పాపారావు,గార బోయిన మోహన్ రావు,చర్ప లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: