మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నుండి వరంగల్ రైతు సంఘర్షణ సభకు జిల్లా నాయకులు జాష్ట సత్యనారాయణ చౌదరి, మొగల్లపు చెన్న కేశవులు, ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా నాయకులు జేష్ట సత్యనారాయణ చౌదరి, మొగళ్లపు చెన్న కేశవరావు, నాయకత్వంలో 50 కార్లు, బస్సులలో వరంగల్ సభకు బయల్దేరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు జేష్ట సత్యనారాయణ చౌదరి, మొగల్లపు చెన్నకేశవరావు, మాట్లాడుతూ, రాహుల్ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో మరింతగా దూకుడు పెంచడం ఖాయమని, రాహుల్ గాంధీ అంటే తెరాస పార్టీ అధిష్టానం, తెలంగాణ ప్రభుత్వం ఎంత భయపడుతుందో నేడు ఆ పార్టీ
నాయకులు చేస్తున్న ప్రకటనలు చూస్తే తెలుస్తుందని, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ అవినీతి, అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని ఖచ్చితంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే సీటు గెలిచి తీరుతామని జిల్లా నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి, మొగల్లపు చెన్నకేశవరావు అన్నారు.
Post A Comment: