దమ్మపేట మే 31 ( మన్యం మనుగడ ) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఈరోజు లచ్చాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు ప్రారంభించారు. గ్రామస్తులు ఉపాధ్యాయులు సహకరించి పాఠశాలను మోడల్ పాఠశాల గా తీర్చిదిద్దుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, ఎంపీడీవో, వైస్ ఎంపీపీ ధారా మల్లికార్జున రావు, గ్రామ పెద్దలు అంకత మహేష్ రావు, మాజీ ఎంపీపీ అల్లం వేంకమ్మ, ఎం ఈవో కీసరి లక్ష్మి, ఎంపీటీసీ నాయుడు శ్రీను,సర్పంచ్ రూప్సింగ్ మండల నాయకులు అబ్దుల్ జిన్నా, రావూరి వీరయ్య, అధ్యాపకులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post A Comment: