మన్యం మనుగడ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమని కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల నందు ఎంపీపీ రేగా కాళికా,స్థానిక సర్పంచ్ ఊకె.రామనాథం ప్రారంబించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలలకూ మహర్దశ వస్తుందని ఆమె అన్నారు.పాఠశాలలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడానికి మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని , పిల్లల అవసరాలకు తగ్గట్టుగా పనులు చేపట్టాలని పనుల్లో నాణ్యత పాటించాలని పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం పేద పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఆర్ఐ.రాజు,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, బుడగం.రాము,చిరంజీవి,పెద్ద రామలింగం,పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: