మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన కారం లక్ష్మి ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం అయ్యి కట్టుబట్టలతో మిగిలారు అని తెలిసి మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ స్పందించి 5వేల రూపాయల నగదు,50 కేజీల బియ్యం, వంటపాత్రలు, దుప్పట్లు, బట్టలు సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు గూడూరు కృష్ణారెడ్డి, సభ్యులు గుంటక శ్రీనివాసరెడ్డి,కొండేరు రోహిత్, బండారు సురేష్, ఎంపీటీసీ చింతపంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: