మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని జిన్నెలగూడెం గ్రామంలో రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వేల్పుల, 3గట్టు ఆదివాసీ అయినటువంటి కాటారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో శనివారం భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే పొదెం వీరయ్య జాతర కి హాజరయ్యారు గిరిజన సాంప్రదాయాలతో ఏర్పాటు చేసిన ఆదివాసీ దేవత కాటారం జాతర మహోత్సవానికి ఆయన హాజరై 12వ అంశాలకు సంబంధించిన ఇలవేల్పు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆహ్వాన కమిటీ స్వాగతం పలికి మేళతాళాలతో మంగళవాయిద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, తొమ్మిదో తెగల సమన్వయకర్త రామకృష్ణ, దుమ్ముగూడెం జెడ్ పి టి సి సీతమ్మ, ఎంపీపీ లక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, వెంకటరమణ రెడ్డి, నాయకులు హరికృష్ణ, కనుబుద్ది దేవా, సర్పంచ్ వరలక్ష్మి, ఆహ్వాన కమిటీ సభ్యులు తుర్రం వెంకట్, నక్క సాయి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post A Comment: