మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను లక్ష్మీ నగరం సెంటర్లో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు ఆధ్వర్యంలో పర్ణశాల, లక్ష్మీ నగరం,రేగుబల్లి, సీతారాంపురం, నర్సాపురం ప్రాంతాల్లో పార్టీ పతాకాలు ఆవిష్కరించారు.లక్షీనగరం మండలకేంద్రంలో పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ చలనచిత్ర రాజకీయరంగాల్లో సామాజిక బాధ్యతను,పాటిస్తూ,ప్రజలు అవసరాలకు తగ్గట్టుగాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు మండలాలు ఏర్పాటు, చౌక దుకాణాల్లో,పది రకాల నిత్యావసరవస్తువులపంపిణీ,మహిళకు ఆస్తిలో వాటా హక్కు,విశ్వ విద్యాలయాల ఏర్పాటుఇలాఎన్నోచేశారు.ప్రపంచ పటంలో తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన మహాపురుషుడు శతజయంతి వేడుకలసందర్బంగా ఇప్పటికైనా,కేంద్ర ప్రభుత్వం, భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో సంతపురి నరసింహారావు,తుష్టిచిన్నడు, కెల్లావేణుగోపాల్,మిడియంవీరయ్య,వాగెరాజు,మచ్చాధర్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: