CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ :- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని

Share it:

 


గుండాల/ఆళ్లపల్లి మే 28(మన్యం మనుగడ) ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఆళ్ల పల్లి మండల కేంద్రంలో సిపిఐ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ. మీ నిజం అంటే సమానత్వం అని ఆయన అన్నారు. కరోనా సమయంలో సిపిఐ పార్టీ మండలంలో ఉన్న నిరుపేదలను కరోనా బాధితులకు అండగా నిలిచిందని ఆయన అన్నారు. నీకు ఏ కష్టమొచ్చినా సిపిఐ పార్టీ అండగా నిలుస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెచ్చగొడుతూ కుర్చీ కోసం చిచ్చు పెడుతోందని ఆయన అన్నారు. దేశంలో నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి అన్నారు. నూతన మండల కమిటీ ని ఈ మహాసభలో ఎన్నుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి ముఖ్య శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, తాళ్లపల్లి మండల కార్యదర్శి కృష్ణయ్య, గుండాల మండల కార్యదర్శి రమేష్ , సర్పంచ్ కోటేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: