మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక ఐ.టి.సి గేటు సమీపంలో ఆగి ఉన్న లారీనీ వెనుక నుండీ గుద్దిన కారు కారు డ్రైవర్ నిద్ర మత్తు కారణం గానే ఇట్టి ప్రమాదం వాటిల్లినట్టు స్థానికులు చెప్తున్నారు.కారులో ఉన్న అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి డ్రైవర్ తో పాటు మరో ఏడుగురు ప్రయాణికులు రామ దర్శనం కొరకు వెళ్ళే క్రమంలో ఇట్టి ప్రమాదం చోటు చేసుకుంది.వెంటనే సమాచారం అందుకున్న (బ్లు కొల్ట్) పోలీసులు కానిస్టేబుల్ కె.వీరబాబు మరియు హోంగార్డు రవికుమార్ కలిసి స్థానికుల సహాయంతో హుటాహుటిన గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: