మన్యం మనుగడ, అశ్వారావుపేట:శుక్రవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన అశ్వారావుపేట మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోమానీ శ్రీను పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను మరణం తీరని లోటని నిత్యం ఎవరోకరి సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించే వరుకు దగ్గరుండే వాడని, ఎదో సాధించాలనే తపన శ్రీనులో ఉండేదని కానీ ఈరోజు ఇలా జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, అశ్వారావుపేట మండల పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు, జూపల్లి రమేష్, మోహన్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు సంపూర్ణ, రవి, శ్రీను, అబ్దుల్ జిన్నా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: