CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యంలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు!.

Share it:


మన్యం మనుగడ/ వాజేడు:


 ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసిన కేసులు నమోదు చేసినా మట్టి అక్రమ తరలింపు ఆగడం లేదు. కార్యాలయం నుంచి సిబ్బంది బయలుడెరగానే వారికి సమాచారం అందుతోంది. అక్కడకు చేరుకునే లోగా జెసిబి లు, లారీలు, ట్రిప్పుర్లును మాయం చేస్తున్నారు. దాడులకు వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ లేకపోవడంతో వెను తిరుగుతున్నారు. మరుసటి రోజు యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తూనే ఉన్నారు.శుక్రవారం అర్ధరాత్రి యదేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి.మండల కేంద్రంలోని చింతూరు పంచాయతీలో సొసైటీ ఇసుక రీచ్ల కు, రోడ్డు నిర్మాణం కొరకు ఎర్రని మట్టి (గ్రావెల్) నిక్షేపాలు ఉండడంతో ఇక్కడ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామాలలో అర్ధరాత్రివేళ మట్టితో తరలిస్తున్నారు గ్రామస్తులు అడిగితే మాకు అన్ని అనుమతులు ఉన్నాయని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.




నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తరలింపు కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలి జెడ్పిటిసి పుష్పలత 


ఇటీవల కొందరు అక్రమ మట్టి దందాకు తెరలేపారు. ట్రిప్పర్లు తో తీసుకువచ్చి ఆయా గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా చెరువు ప్రాంతాల్లోని మట్టిని తీసి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెవెన్యూ, మైనింగ్‌ శాఖల నుంచి అనుమతులు తీసుకుని మట్టిని తరలించాలనీ కానీ ఇష్టానుసారంగా వివరిస్తున్న ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపిన గుత్తేదారు లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ కు స్థానిక జెడ్ పి టి సి, తల్లడి పుష్పలత వినతి పత్రం అందజేశారు.


ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాము.


తహసీల్దార్, సర్వర్ పాష.


షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/59, 1/70 చట్టాలను ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాజేడు మండల తాహాసిల్దార్ తెలిపారు.

Share it:

TS

Post A Comment: