మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం 28 మంది మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ లు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఉజ్వల స్కీం కింద నేటివరకూ దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మందికి సిలిండర్ లు, స్టవ్ లు, రెగ్యులేటర్ లు, పైపులు అన్ని ఉచితంగా నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా గ్యాస్ కలెక్షన్ లేనివారు అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకొని ప్రధానమంత్రి ఉజ్జ్వల స్కీం కింద ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు, పొందాలని కోరారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం కింద సంవత్సరానికి కేవలం పన్నెండు రూపాయలు చెల్లిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే రెండు లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని అన్నారు. అలాగే కాకుండా ప్రధానమంత్రి జీవనజ్యోతి, నిరుపేదల కోసం మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కంచి సోమయ్య, పుల్లారావు, గోపాలరావు, కోండ సత్యనారాయణ, వందనపు సుబ్బు, కిరణ్, ఏన్కూర్ మండల అధ్యక్షులు నల్లమోతు రమేష్ తల్లాడ మండల్ అధ్యక్షులు ఆపద రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: