జూనియర్ కళాశాల సెంటర్ లోని శ్రీ సాయి నాధుని మందిరము లో గురువారం నాడు బాబా వారికి ఉదయం అభిషేకం అర్చనలు జరిపారు. స్వర్ణ ఆభరణాలు ధరింపజేసి హారతి పాడారు.
అతి త్వరలో చేయించనున్న శ్రీ సాయి బాబా వారి స్వర్ణ రుద్రాక్షమాల కు పి ఎస్ ఎన్ చారి, సుశీల దంపతులు 15 వేల రూపాయల విరాళం అందించారు.
అదేవిధంగా గురువారం జరుగు అన్నదానానికి
చిలుక బాల చంద్రశేఖర్ వెంకట మైధిలి దంపతులు, కొండ విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీ లక్ష్మీ దంపతులు, కీర్తిశేషులు సిహెచ్ మాధవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, మరియు భక్తుల ద్వారా అన్నదానానికి 35 వేల రూపాయల విరాళాలు సమకూరినవని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.
మధ్యాహ్నం 650 మంది భక్తులు సాయిబాబా వారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: