మన్యం మనుగడ వాజేడు
పేద ప్రజలందరికి కూడు ,గుడ్డ, వైద్యం, నివసించడానికి కొంప అందరికి సమాన హక్కులు కల్పించాలని పీడిత ప్రజల అభ్యున్నతికి కోసం అహర్నిశలు పోరాడి తన జీవితాన్ని ప్రజల క్షేమం కోసం అర్పించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చల సుందరయ్య ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బైరెడ్డి సాంబశివ అన్నారు,గురువారం సుందరయ్య 37వ వర్థంతి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యి పిలుపునిచ్చారు,వర్థంతి సభ అనంతరం పార్టీ సభ్యులకు ఒక్క రోజు శిక్షణ తరగతిలో ప్రసంగిస్తూ కమ్యూనిస్టు పార్టీ సీపీఎం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని స్థాపించి మొట్టమొదటి సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన గొప్ప వ్యక్తని ఆయన గురించి కొనియాడారు,పార్టీ సిద్దాంతం సబ్యులకు పార్టీ సభ్యుడి విధులు,కర్తవ్యం,లక్ష్యాల గురించి బోధించారు,పార్టీ సభ్యులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పోరాడాలని పిలుపు నిచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య, మండల నాయకులు దామోదర్, కృష్ణబాబు,రమాదేవి,సౌమ్య, పార్టీ సభ్యులు పాల్గొన్నారు,
Post A Comment: