గుండాల మే 28(మన్యం మనుగడ) అడవులను నరికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి భీమానాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలం పరిధిలోని కాంచనపల్లి రేంజ్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హరితహారం స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ జంతువులను వేటాడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటవీ సంపదకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ప్రవీణ, ఎఫ్ డీ ఓ నీరజ్, రేంజర్ రవి కిరణ్, డి ఆర్ ఓ జై రామ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: