మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం జిన్నేలగూడెం గ్రామంలో జరుగుతున్న గిరిజన ఇలావేల్పు 3వగట్టు వారి కాటూరం జాతర కు ముఖ్య అతిధులుగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లంవెంకట్రావు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ వారు వీరికి సాంప్రదాయబద్దంగా మేళతాలాల తో గిరిజన సాంప్రదాయ బద్దంగా కంకణంలు కట్టి స్వాగతం పలికారు.గిరిజన గ్రామదేవతలైన12 మంది ఇలవేల్పులను సందర్శించి మొక్కులుతీర్చుకున్నారు. ఈసందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మరుగుణపడతున్న సాంప్రదాయాలను నేటి యువతరానికి తెలియజేసేవిధంగా ఇంత ఘణంగా జరుపుకోవడం చాలాఆనందకరంగా ఉన్నదని ప్రతి ఏటా ఈ విధంగా జరుపుకుంటుసాంప్రదాయాలను గౌరవించుకోవలని అన్నారు. ఈ సందర్భంగా వారి వెంట పార్టీ మండల అధ్యక్షకార్యదర్సులు, అన్నె సత్యన్నారాయణ మూర్తి, కణితి రాముడు, జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ, ఎంపీపీ లక్ష్మీ, స్థానిక ఎంపీటీసీ తునికి సీత, గౌరవరం సర్పంచ్ సోడి జ్యోతి, పార్టీ నాయకులు తునికి కామేష్, దామెర్ల శ్రీనివాసరావు, జుంజురి జయసింహ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: