మన్యం మనుగడ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి పిలుపుమేరకు వరంగల్ పట్టణంలో శుక్రవారం జరిగిన రైతు సంఘర్షణ సభ కు ఉమ్మడి ఏటూరునాగారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాది మంది తరలి వెళ్లారు.సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విచ్చేసిన నేపథ్యంలో ఉమ్మడి మండలం నుండి సుమారుగా మూడు వేల మంది కార్యకర్తలు మండలం నుండి బయలుదేరి వెళ్లారు.ఆర్టీసీ బస్సు లలో, ప్రత్యేక వాహనాల్లో ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా,కన్నాయిగూడెం వైస్ ఎంపీపీ బోల్లె భాస్కర్ నేతృత్వంలో పార్టీ ప్రజా ప్రతినిధులు,ఎంపీటీసీలు,పిఏ సిఎస్ డైరెక్టర్లు,సర్పంచులు,
ఉప సర్పంచులు,వార్డ్ మెంబర్లు, యూత్ నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు తరలి వెళ్లారు.
Post A Comment: