మన్యం మనగడ కరకగూడెం: నేడు వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సుమారు 200 మంది రైతు సంఘర్షణ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి అని ఆయన అన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో యాక్షన్ ప్లాన్ తెలియజేస్తారని కుటుంబం ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహిళా సంఘ నాయకులు కిషన్ కమిటీ అధ్యక్షులు మండల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: