మన్యం టీవీ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం గ్రామంలో ఆత్మ రామ చంద్ర స్వామి వారి ఆలయం స్వామి తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేశారు ఈరోజు ఉదయం 4 గంటల నుండి సుప్రభాతసేవతో ప్రారంభమైన కార్యక్రమం అభిషేకాలు అర్చనలు మూల మూర్తుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 అభిజిత్ లగ్నం నందు స్వామివారి కళ్యాణం నిర్వహించారు దుమ్ముగూడెం నలుమూలల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు భద్రాచలం సీతారామ చంద్ర స్వామివారికి అనుబంధంగా ఆలయం గా గుర్తింపు పొందిన ఆత్మ రామ చంద్ర స్వామి వారి దేవస్థానం గత కొన్ని సంవత్సరాలుగా కరోనా కారణంగా కళ్యాణం జరగకపోవడంతో ఈ సారి అన్ని ఏర్పాటుతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు కళ్యాణం అనంతరం ఉత్సవ మూర్తులు ,తిరుకళ్యాణ, మహోత్సవంలో మహానివేదన, తీర్థ గోష్టి ,పురోహితులు నిర్వహించారు ఈ కళ్యాణం శోభిత నందు మంగళవాద్య వేదనదములతో అత్యంత వైభవంగా జరిపించారు. తదనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి కట్ట కృష్ణారావు-చిత్రలేఖ జ్ఞాపకార్ధము వారి కుమారులు ,కూతురు, అల్లుళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ అధికారి వేణుగోపాల్ గుప్తా, పురోహితులు, ముత్యాలమ్మ తల్లి కమిటీ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి, కర్రీ బుజ్జి, బైరెడ్డి విశ్వ,కెల్లా శేఖర్, బైరెడ్డి సతీష్, దల్లి వేణు, నరసింహారావు గ్రామస్తులు ,గ్రామ యువకులు పాల్గొన్నారు
Post A Comment: