గుండాల మే 15(మన్యం మనగడ) ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం గుండాల మండలం లో పర్యటించనున్నారు. 75 లక్షలతో పూర్తి అయిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. వాటితో పాటు నూతనంగా మరికొన్ని సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నరు. రేగా పర్యటనను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ కోరారు
Post A Comment: