మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని తోగ్గుడెం మినీ మేడారం సమ్మక్క- సారక్క ఆలయ ప్రాంగణం నందు గల శివమ్ ఫంక్షన్ హాల్ నందు మణుగూరు మండలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మహిళ టైలర్ లకు విప్ రేగా హామీ ఇచ్చారు.టైలరింగ్ వృత్తుల వారికి అండగా ఉండి వారి సమస్యను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.టైలరింగ్ వృత్తిలో పనిచేసే మహిళల తో ముఖాముఖి సమావేశానికి హాజరై,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు లలో రుణాలు, ప్రభుత్వం తరఫున పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.టైలరింగ్ పై ఆధారపడి జీవిస్తున్న మహిళల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని,అన్నారు. మిషన్లు,డ్రెస్ మెటీరియల్స్ తదితర వస్తువులను కొనుగోలు చేసుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉందని కొందరు మహిళలు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలన్నింటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ రజిత,టిఆర్ఎస్ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: