మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం సిఐ బూర రాజగోపాల్ మండలంలోని జానంపేట పరిసరప్రాంత ఎరువుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు పురుగుమందులు అమ్మే వాళ్ళు ఎవరైనా సహించేది లేదని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని హెచ్చరించారు. అటువంటి వారిపై కేసులు బనాయించి,దుకాణాల లైసెన్సులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జానంపేట పరిసర ప్రాంతానికి చెందిన ఎరువుల దుకాణ దారులు పాల్గొన్నారు.
Post A Comment: