మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవ్ గ్రామానికి చెందిన ఎం బి బి ఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు.బండిరేవు గ్రామానికి చెందిన కేతవరపు శ్రీనివాసరావు, శైలజ దంపతుల కుమార్తె చరిత డాక్టర్ సీటు సాధించినందుకు గాను భద్రాచలం పట్టణంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ చేతుల మీదుగా విద్యార్థిని ని తాతయ్య, అమ్మమ్మ గారికి 30 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ కష్టపడి చదివి మన భద్రాచలం ఏజెన్సీలో ప్రజలకు డాక్టర్ గా సేవలు అందించాలని, ఏజెన్సీ ప్రాంతానికి మంచి గుర్తింపు తేవాలని కొనియాడారు. అలానే ఈ సందర్భంగా శ్రీ కృష్ణ దేవరాయలు ట్రస్టు ద్వారా ఆపదలో ఉన్న వారికి సేవా కార్యక్రమాలు, నిరుపేద కుటుంబాలకు చదువు ఇబ్బందిపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ రౌతు నరసింహారావు, రజిని టాప్ తాళ్లపూడి రాము, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: