దమ్మపేట మే 23 ( మన్యం మనుగడ) : తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దమ్మపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరండం
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ నాయకులు తంగెళ్ళమూడి శివకృష్ణ దళిత నాయకుడు సుకుపాక ధర్మ మాట్లాడుతూ దళితులపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని దళితులను చిన్నచూపు చూస్తున్నారని ప్రభుత్వం దళితుల అభివృద్ధి అని చెబుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఊసే లేదని దళిత బంధు అందరికీ వర్తింప జేయాలని గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరపాలని దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని దళిత మహిళకు బ్యాంకు ద్వారా ఆర్థిక సదుపాయం కల్పించాలని 57 సంవత్సరాలు నిండిన దళితులు అందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నక్క నాగమణి బత్తులసాయి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: