మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పదోవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయి. సోమవారం ఉదయం 8:30 నిమిషాల నుండి విద్యార్థులను ఇన్విజిలేటర్ తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించడంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష వ్రాశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 147మంది, సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాసినట్లు చీప్ సూపరిండెంట్స్ దుర్గాప్రసాద్, బాలాజీ లు తెలిపారు. నూటికి నూరు శాతం విద్యార్థులు పరీక్షలు వ్రాయటం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు.
Post A Comment: