CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ సంస్థల అమ్మకానికి బీజేపీ మొగ్గు....సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....

Share it:

  


  మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొగ్గుచూపుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.సోమవారం అయ్యన్నపాలెం గ్రామంలో జరిగిన అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల సంయుక్త మండల మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.తొలుత సిపిఐ పార్టీ జెండాను సీనియర్ జిల్లా నాయకులు గార్లపాటి రామనాథం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ... లాభాల్లో ఉన్న ఎల్ఐసి వంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాగి ఉందన్నారు. బిజెపి మతతత్వ విధానాలతో కేంద్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయన్నారు. దేశంలో మహిళలు, ప్రజాస్వామిక వాదులపై దాడులు చేయటం సర్వసాధారణ విషయంగా మారిందని విమర్శించారు. ఈ మహాసభలలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జిల్లా నాయకులు గార్లపాటి రామనాథం, యార్లగడ్డ భాస్కరరావు, చంద్ర నరేంద్ర కుమార్, చింత స్వరాజ్ రావు, ఉకే నారాయణ, బొర్ర కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: