మన్యం మనుగడ వెబ్ డెస్క్ :
కర్నాటక రాజధాని బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయిత్కు చేదు అనుభవం ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతునేతపై ఓ వ్యక్తి నల్లని ఇంక్ను చల్లాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతుదారులు పట్టుకొని చితకబాదారు. ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రైతు నాయకుడు చంద్రశేఖర్ మద్దతుదారుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. విలేకరుల సమావేశంలో రాకేశ్ టికాయిత్ను రైతు నేత చంద్రశేఖర్ గురించి మీరేం చెబుతారని ప్రశ్నించారు.
దీనికి టికాయిత్ స్పందిస్తూ ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీంతో చంద్రశేఖర్ మద్దతుదారులు టికాయిత్పై బ్లాక్ ఇంక్ను చల్లారు. దీంతో అక్కడే ఉన్న తికాయిత్ మద్దతుదారులు ఇంక్ చల్లిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అలాగే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. తనకు పోలీసులు ఎలాంటి భద్రత ఇవ్వలేదని రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. ప్రభుత్వ అండతోనే జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post A Comment: