గుండాల మే 29(మన్యం మనుగడ) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టిఆర్) శతజయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని టిడిపి మండల అధ్యక్షులు తోలేం సాంబయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకోవడంతోపాటు ఎన్టీఆర్ శత జయంతి ఆనందంగా ఉందన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ ఎస్కె సంధాని, ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, పుల్లయ్య, రాములు, మల్లయ్య, రాజ్యలక్ష్మి, గుర్రం రాములు, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: