మన్నెం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
ఏడూళ్లబయ్యారం గ్రామపంచాయతీ
పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మసీదు కమిటీ అధ్యక్షులు ఎండి సలీం, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే జాంగిర్ నివాసాలలో రంజాన్ పర్వదిన వేడుకలలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎస్సై టి వి ఆర్ సూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ముస్లింల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, రంజాన్ మాసం చాలా పవిత్రమైనది, రంజాన్ మాసం సందర్భంగా, నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనతో మత సామరస్యం శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం ప్రజానీకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడబిడ్డలకు 1,00,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసే ఇస్తార్ విందులు సమాజ ఐక్యతకు నిదర్శనం ఆయన అన్నారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంద న్నారు, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వెన్న కాశిరెడ్డి, ఎస్.కె మీరా సాహెబ్, లాల్ మహ్మద్, పాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: