CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ- ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలం శనగకుంట అగ్నిప్రమాద బాధితులకు నగదు, దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేసి దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది. మంగళవారం శనగకుంట గ్రామాన్ని ఏటీఎ అధ్యక్షులు కల్లూరి జయబాబు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు సందర్శించడం జరిగింది.ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జయబాబు గ్రామంలో కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్పు నిచ్చారు.ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందించిన సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువ గల నగదు,నిత్యావసర సరుకులు మరియు దుస్తులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత నిర్వాసిత కుటుంబాలకు తక్షణమే శాశ్వత ప్రాతిపదికన గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే మంచినీటి ఎద్దడి అధికంగా ఉన్నందున మంచి నీటికి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. చదువుకున్న విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు చాలా వరకు అందరివీ కాలిపోయిన కారణంగా తిరిగి వాళ్ళకి మళ్లీ ఆ సర్టిఫికెట్ లు ఇచ్చే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు చీమల సత్యం, సోయం హనుమంతరావు ,ఈసం సురేందర్రావు, ఈసం రమేష్, తొలెం చిరంజీవి, పెనక ప్రభాకర్, గుంట సత్యనారాయణ, జిమ్మ వెంకటేశ్వర్లు, సింగం రవిబాబు, ముక్తి సీతారాములు, గడ్డం లక్ష్మీనారాయణ, పోల బోయిన బాబురావు, మూతి బద్రి, దనసరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: