CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంట పొలాల్లో నిప్పు పెట్టవద్దు .తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు అవుతారు.

Share it:




  • రైతులు, ప్రజలు అప్రమత్తత వహించాలి
  • ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్

మన్యం మనుగడ, పినపాక:

పంట పోలాలకు నిప్పు పెట్టవద్దని దీని వల్ల అనేక నష్టాలు జరుగుతాయని ఏడూళ్ళ బయ్యారం సి.ఐ బూర రాజగోపాల్ అన్నారు. ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పంట పోలాలకు నిప్పు పెట్టడం వల్ల భూ సారం దెబ్బ‌తినడమే కాకుండా, మంటలు గ్రామాలలోకి విస్తరించి, ఇళ్ళు కాలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కొంత మంది రైతులు పంటలు కోసాక,గడ్డిని కాల్చేందకు మంటలు పెట్టడం వల్ల పంట పోలాలు దెబ్బ తినడమే కాకుండా, భూసారం దెబ్బ తిని, నూతన పంటలు వేసినప్పడు,దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. పోలాలకు మంటలు పెట్టినప్పడు , వేసవి కాలం కావడం వల్ల, గాలికి మంటలు,చెలరేగి గ్రామలోకి విస్తరించడం వల్ల ఇళ్ళు కాలిపోతాయని ప్రజలకు సూచించారు. రైతులు,ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,గ్రామాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Share it:

TS

Post A Comment: