మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన కారం రాజు కు చెందిన ఇల్లు సోమవారం నాడు అగ్నికి ఆహుతి అయింది. విషయం తెలుసుకున్న పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి 50 కేజీల బియ్యము, దుస్తులు, వంట గిన్నెలను అందజేశారు.ఎంపీటీసీ చింతపండు సత్యం టార్పాలిన్ పట్టా,ఉప సర్పంచ్ బుస్సి శీను వెయ్యి రూపాయలు,టిఆర్ఎస్ నాయకుడు బొలిశెట్టి నరసింహారావు 1000 లను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తి శ్రీలత, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేరు నాగభూషణం, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు సోంపల్లి తిరుపతి, రైతు విభాగం మండల అధ్యక్షుడు దినసరపు శ్రీనివాసరెడ్డి, యూత్ అధ్యక్షుడు గాండ్ల అశోక్, నర్సింహారావు, బండా మనోజ్ రెడ్డి, యాంపాటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: