మన్యం టీవీ దుమ్ముగూడెం::
ప్రభుత్వo సబ్సిడీ పై రైతులకు ఇస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు పంపిణి ఈ కార్యక్రమాన్ని మండలంలో కేంద్రంలో ప్రారంభించారు. జెడ్పిటిసి తెల్లం సీతమ్మ ,రైతుబంధు సమితి మండల అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అందజేశారు ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ఈ పచ్చిరొట్ట విత్తనాలు రైతు సోదరులు అందరు తీసుకొని భూమిని సారవంతం పెంచుకోవచ్చు అని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు ములకపాడు రైతు సేవ అగ్రో కేంద్రం, దుమ్ముగూడెం సొసైటీ లో జీలుగ, పిల్లిపేసర విత్తనాలు అందుబాటులో కలవు అని వ్యవసాయ అధికారి తెలిపారు.రైతులు విత్తనాలు పొందుటకు తమ పట్టా, ఆధార్, జిరాక్సులు లు ఇచ్చి విత్తనాలు పొంద గలరు తెలియజేశారు పూర్తి వివరాలకు దుమ్మగూడెం సొసైటీ,మలకాపాడు ఆగ్రో లో వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో సొసైటీ చైర్మన్ కిలిమి యెల్లారెడ్డి ,తెరాస మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు , వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, సొసైటీ సి ఈ ఓ ముత్తయ్య, ఏ ఈ ఓ బాలాజీ ,హసీనా ,ప్రవీణ్ సొసైటీ డైరెక్టర్ పీసోడి వెంకటేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: