మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట గ్రామంలోని బాణాల నారాయణ దళిత బందు పథకం కింద లబ్ధి దారుడుగా ఎంపికైన సందర్భంగ డైరీ ఫామ్ నిర్మాణం కోరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ డైరీ ఫామ్ నిర్మాణం పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితుల కోసం దళితుల శ్రేయస్సు కోరి ప్రవేశ పెట్టినా ఈ దళిత బందు పథకం ద్వారా మొదటి విడతగా అశ్వారావుపేట మండలం లో మొత్తం 31 మంది లబ్ధి దారులను ఎంపిక చేయటం జరిగిందని, వారిలో భాగంగా బాణాల నారాయణకు డైరీ ఫామ్ నిర్మాణం కోరకు మొదటగా కొంత నిధులు ఇవ్వడం జరిగిందని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంసెట్టి వరలక్ష్మి, నార్లపాటి రాములు, గంధం వెంకటేశ్వరరావు, బాణాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: