మన్యం మనుగడ ప్రతినిధికి చండ్రుగొండ: చండ్రుగొండ మండలం దామరచర్ల పంచాయతీ లో గల ప్రభుత్వ పాఠశాలను జాతీయ రహదారి పక్కనుండి మార్చి గ్రామంలో నిర్మించాలని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గాదె శివప్రసాద్ లు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని మన ఊరు మన బడి క్రింద కొత్త పాఠశాలను నిర్మించాలని ఆదేశించారు.
Post A Comment: