మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 21 మండలపరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన పూరేటి బాబురావు (40) రాయి ముత్తయ్య (30) అను ఇరువురు పొరక పుల్లలు శేఖరణ కోసం భోజ్యతండా గ్రామ శివారు అటవీ ప్రాంతానికి వెళ్లి మంచినీరు తాగుదామని సీతారామ ప్రాజెక్ట్ కాలువలో నీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు జారిపాడి మృతిచెందారు, వీరికి ఈత రాకపోవడంతో ఈ ప్రమాదంలో మృతి చెందారని, వీరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పోటు గణేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్తుల సాయంతో కాలువలో నుంచి మృత దేహాలను బయటకు తీసి పంచనామా నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికితరలించి విచారణ చేపట్టారు.
Post A Comment: