మన్యం మనుగడ, పినపాక:
పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సబ్సిడీ విత్తనాలు, జీలుగులను మండలంలోని రైతులకొరకు , సహకార సంఘ అధ్యక్షులు రవి వర్మ అధ్యక్షతన రైతులకు పంపిణీ చేయుట జరిగింది. అసలు ధర1897.50 ప్రభుత్వ సబ్సిడీ 1233.30, రైతు ధర 664.20 ,కావునా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సంఘ అధ్యక్షులు రవి వర్మ తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మండలం లోని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య ,సంఘ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి , ఏ డి ఏ తాతారావు , వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు , వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణరావు, రమేష్ లు ,సంఘ డైరెక్టర్లు గునిగంటి సమ్మయ్య, పొనుగోటి కామేశ్వరరావు సంఘ సీఈవో చింతల రాంబాబు ,సంఘ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: