మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని కరకగూడెం గ్రామానికి చెందిన కల్లూరి. సారయ్య-సుశీల దంపతుల కుమార్తె సాయి కీర్తి వివాహ ప్రథాన కార్యక్రమనికి హాజరై కాబోయే నవ వధువుకి అక్షింతలు వేసి ఆశీర్వదించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 11,500 రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. అనంతరం తాటిగూడెం గ్రామనికి చెందిన పోలెబోయిన నరేష్-రమ నూతన దంపతులను ఆశీర్వదించారు.అలాగే గొల్లగూడెం గ్రామనికి చెందిన కుంజ నర్సయ్య- లక్ష్మీ దంపతుల కుమార్తె సరిత ప్రాథన వేడుకకు హాజరై కాబోయే నూతన వదువును ఆశీర్వదించి,అక్షింతలు వేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: