గుండాల/ఆళ్లపల్లి మే మే 26(మన్యం మనుగడ) ఉపాధ్యాయుల పరస్పర అంగీకార బదిలీల పత్రాలను నిలుపుదల చేయాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ రక్షణ తో అనుమతించి ఇప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయులు అంగీకార పత్రాలు ఇవ్వడం సరైంది కాదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 21 ద్వారా పరస్పర బదిలీలకు అనుమతించి జీవో నెంబర్ 402 ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అధికార పత్రాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. టీచర్ల అంగీకార పత్రాలను లేకుండానే బదిలీలకు అనుమతించాలని కోరారు
Post A Comment: