మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల తిమ్మంపేట గ్రామ పంచాయతీ లో గ్రామ కమిటీ అధ్యక్షులు చిన్నపల్లి రాంబాబు ఆధ్వర్యంలో వరంగల్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ లో ఇచ్చిన హామీలను రైతులకు తెలిపేందుకు వాడ వాడన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ ఇంఛార్జ్లు పూజారి సురేందర్ బాబు, మసిరెడ్డి వెంకటరెడ్డి,తూడి భగవాన్ రెడ్డి, పర్యవేక్షణలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మాట్లాడుతూ మాట తప్పని పార్టీ మడమ తిప్పని పార్టీ ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమా నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, కౌలు రైతులకు పెట్టుబడుల సాయం, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు,ధరణి పోస్టల్ ను రద్దుచేసి భూముల రక్షణకు రెవిన్యూ స్థాయి లో కొత్త పథకం తీసుకొని వస్తాం,నకిలీ విత్తనాలు అమ్మే ఫర్టీలైజర్ షాప్ లపై కఠిన చర్యలు తీసుకొని పి డి యాక్ట్ కేసులు నమోదుచేస్తాం, రైతును రాజును చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జైరాంరెడ్డీ,ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు,బ్లాక్ ఉపాధ్యక్షుడు చిలకమర్రి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాదా మల్లన్న, సీనియర్ నాయకులు నర్రా కిషోర్,పొందేం నగేష్,బొడ రామచంద్రయ్య,బసారి నాగార్జున, బసారి హరికృష్ణ, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, బొడ బొర్రయ్య,చెనపల్లి స్వామి, ముగల ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: