మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ లబ్ధిదారులకు, 31 లక్షల విలువగల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారంనాడు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయ అన్నారు, ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు, ప్రతి పేదింటి ఆడబిడ్డ కు పెళ్లి కానుక 1,00,116 లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాలు ఉన్నాయ అన్నారు. అదేవిధంగా రైతాంగం అభివృద్ధి కొరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే తపనతో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కెసిఆర్ కిట్ లు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: