దమ్మపేట ఏప్రిల్ 06 ( మన్యం మనుగడ ) : ప్రజా ప్రస్థానం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామం నుండి ప్రారంభమై గిరిజన బడుగు బలహీన వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆ సమస్యలపై ప్రభుత్వం తో పోరాటం చేస్తానని ధైర్యాన్ని నింపుతూ, రైతు గోస, నిరుద్యోగ దీక్షలు చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను నిలదిస్తూ గత వారం రోజులుగా అశ్వారావుపేట నియోజకవర్గం లో సాగిన షర్మిలక్క ప్రజా ప్రస్థానం పాదయాత్ర. ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైన రోజు నుండి ఈరోజు అశ్వారావుపేట నిజయోజకవర్గం దమ్మపేట మండలంలోని చివరి గ్రామం అయిన నాచారం లో ముగింపు పాదయాత్ర లో పాల్గొని ysr తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి షర్మిలక్క గారికి నాగలి ని బహుకరించడం జరిగింది. ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు , అభిమానులకు, నాయకులకు,యువకులకు, సోదరి సోదరిమనులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు అశ్వారావుపేట నియోజకవర్గ వైఎస్సార్ టీపీ యువనాయకులు పెనుబల్లి రమేష్ బాబు .
Post A Comment: