గుండాల/ ఆళ్ల పల్లి మే 1(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన పిఎసిఎస్ చైర్మన్ రామయ్య ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి పిఎసిఎస్ చైర్మన్ రామయ్య హాజరై విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న కేసీఆర్కు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు కోపరేటివ్ డైరెక్టర్ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: